కోవిడ్ ఎఫెక్ట్ః వీకెండ్లో దోహా మెట్రో రైల్ బంద్
- April 08, 2021
దోహా: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ఖతార్ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను మళ్లీ కఠినతరం చేస్తోంది.ఇందులో భాగంగా రవాణా సర్వీసులపై ఫోకస్ చేసింది. దోహా మెట్రోలో ఇక నుంచి పూర్తి స్థాయి సామర్థ్యంలో 20 శాతం మంది ప్రయాణికులనే అనుమతించనున్నట్లు వెల్లడించింది.ఇక వారంతపు సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఆదివారం నుంచి గురువారం వరకు 20 శాతం ప్రయాణికులతో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.శుక్రవారం, శనివారం మాత్రం సర్వీసులు రద్దు అవుతాయి. ఈ నెల 9 నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









