భారత్ లాక్ డౌన్ పై క్లారిటీ...
- April 08, 2021
న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోన్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. కరోనా వ్యాప్తి, లాక్డౌన్, కర్ఫ్యూ, వ్యాక్సినేషన్పై కీలక వ్యాఖ్యలు చేశారు.. రెండో దశలో కరోనా వేగంగా విస్తరిస్తోందన్న ప్రధాని.. అయితే, పెరుగుతున్న కేసులను చూసి భయపడొద్దని ధైర్యాన్ని చెప్పారు.. లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ఆయన.. ప్రస్తుత పరిస్థితి ఓ సవాలుగా మారుతోందన్నారు.. కోవిడ్ సెకెండ్ వేవ్తో మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది.. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, పంజాబ్, వంటి పలు రాష్ట్రాల్లో మనుపటి గరిష్ఠ స్థాయిని మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలు నిర్లక్ష్యంగా మారిపోయారన్నారు.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా అలసత్వం పెరిగిందన్న ప్రధాని.. కరోనాపై పోరాటం కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.. పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయాలని, ఈ క్రమంలో కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎంలకు చెప్పారు.. అలాగే వ్యాక్సిన్ వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కరోనా కట్టడికి రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ.. కోవిడ్ టెస్ట్లు పెంచాలని.. ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య భారీగా పెంచాలన్నారు.. వ్యాక్సినేషన్ కంటే టెస్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సెకండ్ వేవ్ పై ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదన్న ప్రధాని.. అందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఇక, ఏప్రిల్ 11 నుంచి 14వ తేదీ వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని పిలుపునచ్చారు.. 45 ఏళ్లు దాటినవారు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కోవిడ్ పెరిగినా భయం వద్దు.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండదని స్పష్టం చేశారు.. అయితే, రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ పెడితే మంచిదన్న ఆయన.. కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ ఓ ప్రత్యామ్నాయం అని.. నైట్ కర్ఫ్యూను 'కరోనా కర్ఫ్యూ'గా పిలుద్దాం అన్నారు.
తాజా వార్తలు
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!







