షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న అరబ్ వ్యక్తి అరెస్ట్
- April 09, 2021
దోహా: అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా షాపుల్లోకి చోరీలకు పాల్పడుతున్న అరబ్ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఖతార్ పోలీసులు వెల్లడించారు. పారిశ్రామిక ప్రాంతంలోని పలు షాపుల్లో వరుసగా చోరీలు జరుగుతుండటం..తెల్లవారే సరికి డబ్బులు, ఇతర విలువైన వస్తువులు కనిపించకపోవటం కొన్నాళ్లుగా జరుగుతూ వస్తోంది. దీంతో ఆ ప్రాంతంలోని షాపు ఓనర్లు కొద్ది కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ చోరీలపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి దొంగను పట్టుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు అవసరమైన అనుమతులు తీసుకొని అదుపులోకి తీసుకొని విచారించటంతో మొత్తం వ్యవహారం బయటపడింది. తన వద్ద ఉన్న పరికరాలతో అర్ధరాత్రి వేళల్లో షాపుల్లోకి చొరబడి విలువైన వస్తువులు చోరీ చేసేవాడినని...చోరీలకు అవసరమైన పనిముట్లను కూడా పోలీసులకు చూపిస్తూ నేరం అంగీకరించాడు. దీంతో చోరీలకు ఉపయోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







