శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- April 09, 2021 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ కు 6E-259 విమానం ద్వారా వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద ఎలాంటి ఆధారాలు లేని 943 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారుగా రూ. 44.8లక్షలు ఉంటుందని తెలిపారు. బంగారం తరలిస్తున్నఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com