ఎయిమ్స్లో కరోనా కలకలం..
- April 09, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా సెకండ్వేవ్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఇక, ఢిల్లీలోని ప్రముఖు ఆస్పత్రులను కరోనా వెంటాడుతోంది... ఎయిమ్స్ ఆస్పత్రిలోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది.. ఎయిమ్స్లో 35 మంది డాక్టర్లకు పాజిటివ్గా నిర్ధారణ కాగా.. గంగా రామ్ ఆసుపత్రిలోనూ 37 మంది వైద్యులకు కూడా కరోనా సోకింది.. వీరంతా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులని, తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని చెబుతున్నారు.. ప్రస్తుతం 32 మంది వైద్యులు హోమ్ ఐసొలేషన్లో ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు వెల్లడించారు.. కరోనా బారినపడినవారులో వైద్యులతో పాటు.. మరికొందరు సిబ్బంది కూడా ఉన్నారు.. ఇక, తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డిఎస్ రానాతో సమీక్షించారు.. కాగా, ఎయిమ్స్ మరియు సర్ గంగా రామ్ హాస్పిటల్ రెండూ దాదాపు ఒక సంవత్సరం పాటు మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటంలో ముందు వరుసలో ఉన్నాయి. ఇక, ఢిల్లీలో రోజువారి కేసుల సంఖ్య తొలిసారి 7 వేల మార్క్ను కూడా క్రాస్ చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







