ఎయిమ్స్లో కరోనా కలకలం..
- April 09, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా సెకండ్వేవ్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఇక, ఢిల్లీలోని ప్రముఖు ఆస్పత్రులను కరోనా వెంటాడుతోంది... ఎయిమ్స్ ఆస్పత్రిలోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది.. ఎయిమ్స్లో 35 మంది డాక్టర్లకు పాజిటివ్గా నిర్ధారణ కాగా.. గంగా రామ్ ఆసుపత్రిలోనూ 37 మంది వైద్యులకు కూడా కరోనా సోకింది.. వీరంతా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులని, తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని చెబుతున్నారు.. ప్రస్తుతం 32 మంది వైద్యులు హోమ్ ఐసొలేషన్లో ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు వెల్లడించారు.. కరోనా బారినపడినవారులో వైద్యులతో పాటు.. మరికొందరు సిబ్బంది కూడా ఉన్నారు.. ఇక, తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డిఎస్ రానాతో సమీక్షించారు.. కాగా, ఎయిమ్స్ మరియు సర్ గంగా రామ్ హాస్పిటల్ రెండూ దాదాపు ఒక సంవత్సరం పాటు మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటంలో ముందు వరుసలో ఉన్నాయి. ఇక, ఢిల్లీలో రోజువారి కేసుల సంఖ్య తొలిసారి 7 వేల మార్క్ను కూడా క్రాస్ చేసింది.
తాజా వార్తలు
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్
- జూన్ 15 లోపు యూనిఫారాల పంపిణీ: సీఎం రేవంత్
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్









