యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- January 20, 2026
యూఏఈ: భారత్ లో పర్యటిస్తున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక బహుమతులను అందజేశారు. న్యూఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్లో మోదీ స్వాగతం పలికిన తర్వాత, ఎమిరేట్స్ నాయకుడు ప్రధానమంత్రి నివాసమైన లోక్ కళ్యాణ్ మార్గ్కు వెళ్లారు. అక్కడ భారతదేశ వైవిధ్యాన్ని తెలిపే రెండు ప్రత్యేక బహుమతులను ఆయనకు అందించారు. పువ్వులు మరియు సాంప్రదాయ డిజైన్లను కలిగి ఉన్న గుజరాత్కు చెందిన చెక్క ఊయలను అందజేశారు. ఊయలతో పాటు వెండి పెట్టెలో పష్మినా శాలువాను కూడా బహుమతిగా ఇచ్చారు. కాశ్మీర్ కు చెందిన ఈ శాలువాను చాలా సన్నని ఉన్నితో చేతితో తయారు చేస్తారు. ఇది మృదువుగా, తేలికగా మరియు వెచ్చగా ఉంటుంది. దీనిని తెలంగాణలో తయారు చేసిన వెండి పెట్టెలో పెట్టి అందజేశారు. ఈ రెండూ బహుమతులు భారతదేశ గొప్ప చేనేత మరియు హస్తకళల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. అనంతరం ఇద్దరు నాయకులు ఊయలపై కూర్చొని నవ్వుతూ మాట్లాడుకున్నారు. వీటితోపాటు యూఏఈ అధ్యక్షుడి తల్లి షేఖా ఫాతిమా బింట్ ముబారక్ అల్ కెత్బీకి కూడా పష్మినా శాలువాతో పాటు అలంకరించిన వెండి పెట్టెలో కాశ్మీరీ కుంకుమపువ్వును బహుమతిగా ఇచ్చారు.


యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షేక్ మొహమ్మద్ భారత్ లో పర్యటించడం ఇది మూడోసారి. ఇది న్యూఢిల్లీ మరియు అబుదాబి మధ్య ఉన్నత స్థాయి సంబంధాలను తెలియజేస్తుంది. ఇక యూఏఈ ప్రెసిడెండ్ తోపాటు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రి షేక్ హమద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రత్యేక వ్యవహారాల కోసం ప్రెసిడెన్షియల్ కోర్ట్ డిప్యూటీ చీఫ్ షేక్ హమద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సహా పలువురు మంత్రులు మరియు సీనియర్ అధికారులు భారత్ లో పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









