పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రం
- April 12, 2021
దోహా: ఏప్రిల్ 12న పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభమువుతోంది. మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారి దోహా పారిశ్రామిక ప్రాంతంలోని ఈ కేంద్రాన్ని సందర్శించారు.ఇంతకు ముందున్న మెడికల్ కమిషన్ ఫెసిలిటీ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హమాద్ మెడికల్ కార్పొరేషన్, ఖతార్ ఛారిటీ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తాయి.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ, కొనొకో ఫిలిప్స్ - ఖతార్ సహకారమందిస్తాయి. ఈ కేంద్రం ద్వారా కోవిడ్ 19పై పోరులో మరో కీలకమైన ముందడుగు వేసినట్లవుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి. మొత్తం 35 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇప్పటికే ఖతార్ లో అందుబాటులో వున్నాయి. ఇప్పటిదాకా 1,079,000 మందికి వ్యాక్సిన్లను అందించారు. కాగా, కొత్త వ్యాక్సినేషన్ కేంద్రం వారంలో ఆరు రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







