65 మంది పాకిస్థానీయులకు భారతీయ పౌరసత్వం--కేంద్రమంత్రి

- March 02, 2016 , by Maagulf
65 మంది పాకిస్థానీయులకు భారతీయ పౌరసత్వం--కేంద్రమంత్రి

గాయకుడు అద్నన్‌ సమీతో పాటు 65 మంది పాకిస్థానీయులకు ఈ ఏడాది భారతీయ పౌరసత్వం ఇచ్చినట్లు రాజ్యసభలో వెల్లడించారు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు. 2016 సంవత్సరంలోని మొదటి రెండు నెలల్లో పాకిస్థానీయులు 65 మంది కాక, మరో 55 మంది విదేశీయులకు భారతీయ పౌరసత్వం ఇచ్చామన్నారు. 2015లో 263 మంది పాకిస్థానీయులకు, 344 మంది వేరే దేశాలకు చెందిన వారికి భారతీయ పౌరసత్వాన్ని కల్పించారు. 2014లో 267మంది పాకిస్థానీయులకు, 352 మంది ఇతరులు భారత పౌరసత్వం పొందినట్లు సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com