కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ హోంమంత్రి
- April 15, 2021
గుంటూరు: ఏపీ హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత గుంటూరు లోని సాయి భాస్కర్ హాస్పిటల్ లో కోవాక్సిన్ వేయించుకున్నారు.ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ వాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అదేవిధంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున మాస్క్, సానిటైజ్ చేసుకోవడం, స్వీయ నియంత్రణ పాటించడం తప్పనిసరి అన్నారు.ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కోవిడ్ వాక్సిన్ వేయడం పూర్తయిందన్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాక్సినేషన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









