కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ హోంమంత్రి

- April 15, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ హోంమంత్రి

గుంటూరు: ఏపీ హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత గుంటూరు లోని సాయి భాస్కర్ హాస్పిటల్ లో కోవాక్సిన్ వేయించుకున్నారు.ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ వాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అదేవిధంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున మాస్క్, సానిటైజ్ చేసుకోవడం, స్వీయ నియంత్రణ పాటించడం తప్పనిసరి అన్నారు.ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కోవిడ్ వాక్సిన్ వేయడం పూర్తయిందన్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాక్సినేషన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com