ఏపీలో కరోనా అప్డేట్

- April 16, 2021 , by Maagulf
ఏపీలో కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో క‌రోనా క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.నిన్న‌టితో పోలిస్తే ఇవాళ అమాంతం పెరిగిపోయాయి కొత్త కేసులు.. రాష్ట్రవ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 35,962 సాంపిల్స్ ని ప‌రీక్షించ‌గా.. 6,096 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు,అనంతపురం, కడప, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పు న మొత్తం 20 మంది కోవిడ్‌తో మృతిచెందారు..ఇక‌, ఇదే స‌మ‌యంలో 2,194 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నార‌ని.. నేటి వరకు రాష్ట్రంలో 1,56,06,163 సాంపిల్స్ ని ప‌రీక్షించామ‌ని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. ఇక‌, క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 9,48,231కు చేరుకోగా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 35,592గా ఉన్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు 9,05,266 మంది రిక‌వ‌రీ కాగా..  7,373 మంది కోవిడ్‌తో మృతిచెందారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com