లులు గ్రూప్ చైర్మన్ కు కీలక సర్జరీ..

- April 16, 2021 , by Maagulf
లులు గ్రూప్ చైర్మన్ కు కీలక సర్జరీ..

అబుధాబి: అబుధాబికి చెందిన భారతీయ వ్యాపారవేత్త, లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.కొచ్చిలో ఈ నెల 11న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చిత్తడి నేలపై క్రాష్ ల్యాండ్ అయింది.ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు.అబుధాబిలోని రాజ కుటుంబం పంపిన ప్రత్యేక విమానంలో సోమవారం యూసుఫ్ అలీ మరియు కుటుంబ సభ్యులు అబుధాబి చేరుకున్నారు.

అనంతరం బుర్జీల్ ఆసుపత్రిలో చేరారు.అక్కడాయనకు మంగళవారం ప్రఖ్యాత న్యూరో సర్జన్  డాక్టర్ అమర్ అల్ షావర్బీ నేతృత్వంలోని 25 మంది వైద్యుల బృందం వెన్నెముక శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారని వి.నందకుమార్( లులు గ్రూప్-డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్) మాగల్ఫ్ కు తెలిపారు.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com