లులు గ్రూప్ చైర్మన్ కు కీలక సర్జరీ..
- April 16, 2021
అబుధాబి: అబుధాబికి చెందిన భారతీయ వ్యాపారవేత్త, లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.కొచ్చిలో ఈ నెల 11న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చిత్తడి నేలపై క్రాష్ ల్యాండ్ అయింది.ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు.అబుధాబిలోని రాజ కుటుంబం పంపిన ప్రత్యేక విమానంలో సోమవారం యూసుఫ్ అలీ మరియు కుటుంబ సభ్యులు అబుధాబి చేరుకున్నారు.
అనంతరం బుర్జీల్ ఆసుపత్రిలో చేరారు.అక్కడాయనకు మంగళవారం ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ అమర్ అల్ షావర్బీ నేతృత్వంలోని 25 మంది వైద్యుల బృందం వెన్నెముక శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారని వి.నందకుమార్( లులు గ్రూప్-డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్) మాగల్ఫ్ కు తెలిపారు.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







