అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ఇండియా వెళ్ల‌వ‌ద్ద‌ని ఒమ‌న్ ఎంబసీ హెచ్చ‌రిక‌

- April 18, 2021 , by Maagulf
అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ఇండియా వెళ్ల‌వ‌ద్ద‌ని ఒమ‌న్ ఎంబసీ హెచ్చ‌రిక‌

ఒమ‌న్: ఒమ‌న్ ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌రం అనుకుంటే త‌ప్ప భార‌త్ కు ప్ర‌యాణించ‌వ‌ద్ద‌ని న్యూ ఢిల్లీలోని సుల్తానేట్ రాయ‌బార కార్యాల‌యం హెచ్చ‌రించింది. భార‌త్ లో కోవిడ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ హెచ్చ‌రిక విడుద‌ల చేసింది. వీలైనంత వ‌ర‌కు భార‌త్ కు ప్ర‌యాణాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని...అత్య‌వ‌స‌రం అనుకుంటే త‌ప్ప ప్ర‌యాణించొద్ద‌ని సూచించింది. ప్ర‌స్తుతం భార‌త్ లో రోజుకు రెండు ల‌క్ష‌ల‌కుపైగా కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని పేర్కొంది. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ లోని ప‌లు రాష్ట్రాలు ప‌లు ఆంక్ష‌ల‌ను విధిస్తున్నాయ‌ని వెల్ల‌డించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com