Dh400,000విలువైన డబ్బు, నగల చోరీ కేసులో గ్యాంగ్ అరెస్ట్
- April 18, 2021
యూఏఈ: ఓ ఇంట్లో Dh400,000 విలువైన డబ్బు, నగలు దోచుకున్న కేసులో తొమ్మిది మంది దొంగలను అరెస్ట్ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు.ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు ముందుగా ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేశామని..దీంతో అతని నేర చరిత్ర మొత్తం బయటపడిందని వివరించారు. ఫిర్యాదు చేసిన మహిళ ఇంటితో పాటు గతంలో అతను పలు ఇళ్లలో చరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.చోరీలలో తనకు మరో ఎనిమిది మంది సహకరించారని,వారిలో మహిళలు కూడా ఉన్నట్లు విచారణలో నిందుతుడు ఒప్పుకున్నట్లు తెలిపారు.నిందితుడు ఇచ్చిన సమాచారంతో మిగిలిన ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేశామన్నారు పోలీసులు.నిందితులు అందర్నీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరలించామన్నారు.ప్రజలు తమ ఇళ్ల దగ్గర సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని తద్వారా చోరీలను అడ్డుకోగలమని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..









