గాలి ద్వారా కరోనా వైరస్ వాప్తి చాలా ఆందోళన కలిగిస్తోంది: ఎయిమ్స్
- April 18, 2021
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో ఏకంగా 2 లక్షల 60 వేలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. ఏకంగా 1501 మంది మృతిచెందారు. సరాసరిన గంటకు 10 వేల కేసులు వస్తుంటే.. మరణాలు కూడా ఊహించని రీతిలో పెరుగుతున్నాయి.దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 47లక్షల 88లక్షల 109కు చేరింది. ఇక రికవరీ రేటు 87.23శాతానికి తగ్గింది.కాగా గాలి ద్వారా కరోనా వాప్తి చాలా ఆందోళన కలిగిస్తోందని ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా తెలిపారు.దీంతో కరోనా బారి నుంచి రక్షణ పొందాలంటే ఎన్95 మాస్క్ ధరించాలని సూచించారు. మిగిలిన మాస్కులు అయితే రెండు పెట్టుకోవాలన్నారు. వైరస్ రూపాంతరం మార్చుకోవడం వల్లే కేసుల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు. ఇక టీకా పంపిణీల్లో భారత్ మరో రికార్డు సృష్టించింది. కేవలం 92 రోజుల్లోనే అత్యంత వేగంగా 12కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 12కోట్ల టీకా డోసుల లక్ష్యం చేరుకోవడానికి అమెరికాలో 97 రోజులు పట్టింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









