గాలి ద్వారా కరోనా వైరస్ వాప్తి చాలా ఆందోళన కలిగిస్తోంది: ఎయిమ్స్
- April 18, 2021
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో ఏకంగా 2 లక్షల 60 వేలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. ఏకంగా 1501 మంది మృతిచెందారు. సరాసరిన గంటకు 10 వేల కేసులు వస్తుంటే.. మరణాలు కూడా ఊహించని రీతిలో పెరుగుతున్నాయి.దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 47లక్షల 88లక్షల 109కు చేరింది. ఇక రికవరీ రేటు 87.23శాతానికి తగ్గింది.కాగా గాలి ద్వారా కరోనా వాప్తి చాలా ఆందోళన కలిగిస్తోందని ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా తెలిపారు.దీంతో కరోనా బారి నుంచి రక్షణ పొందాలంటే ఎన్95 మాస్క్ ధరించాలని సూచించారు. మిగిలిన మాస్కులు అయితే రెండు పెట్టుకోవాలన్నారు. వైరస్ రూపాంతరం మార్చుకోవడం వల్లే కేసుల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు. ఇక టీకా పంపిణీల్లో భారత్ మరో రికార్డు సృష్టించింది. కేవలం 92 రోజుల్లోనే అత్యంత వేగంగా 12కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 12కోట్ల టీకా డోసుల లక్ష్యం చేరుకోవడానికి అమెరికాలో 97 రోజులు పట్టింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







