గాలి ద్వారా కరోనా వైరస్ వాప్తి చాలా ఆందోళన కలిగిస్తోంది: ఎయిమ్స్
- April 18, 2021
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో ఏకంగా 2 లక్షల 60 వేలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. ఏకంగా 1501 మంది మృతిచెందారు. సరాసరిన గంటకు 10 వేల కేసులు వస్తుంటే.. మరణాలు కూడా ఊహించని రీతిలో పెరుగుతున్నాయి.దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 47లక్షల 88లక్షల 109కు చేరింది. ఇక రికవరీ రేటు 87.23శాతానికి తగ్గింది.కాగా గాలి ద్వారా కరోనా వాప్తి చాలా ఆందోళన కలిగిస్తోందని ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా తెలిపారు.దీంతో కరోనా బారి నుంచి రక్షణ పొందాలంటే ఎన్95 మాస్క్ ధరించాలని సూచించారు. మిగిలిన మాస్కులు అయితే రెండు పెట్టుకోవాలన్నారు. వైరస్ రూపాంతరం మార్చుకోవడం వల్లే కేసుల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు. ఇక టీకా పంపిణీల్లో భారత్ మరో రికార్డు సృష్టించింది. కేవలం 92 రోజుల్లోనే అత్యంత వేగంగా 12కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 12కోట్ల టీకా డోసుల లక్ష్యం చేరుకోవడానికి అమెరికాలో 97 రోజులు పట్టింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







