మహారాష్ట్రలో కోవిడ్ విజృంభణ
- April 18, 2021
ముంబై: భారత దేశంలో కోవిడ్ రోజు రోజుకీ విజృంభిస్తోంది.సెకండ్ వేవ్ రూపంలో ప్రమాదం ఎక్కువవుతోంది.ఇప్పటికే రోజు వారీ కోవిడ్ కేసుల సంఖ్య 2 లక్షలను దాటింది.దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ కట్టడికి అనేక చర్యలు చేపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కోవిడ్ విలయతాండవం చేస్తోంది. ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 68,631 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 503 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.రాష్ట్రంలో కోవిడ్ వల్ల మొత్తం 60,473 మంది మృతి చెందారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,70,388 మంది కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









