రమదాన్ మాసంలోనూ రక్తదానం చేయండి: డిబిబిఎస్
- April 19, 2021మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలోనూ రక్తదానం చేయవచ్చునని డిపార్టుమెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ (డిబిబిఎస్) వెల్లడించింది. రమదాన్ మాసం నేపథ్యంలో రక్తదాతల సంఖ్య తగ్గడం వల్ల, రక్తం అవసరమైనవారికి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని డిబిబిఎస్ పేర్కొంది. సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ (బౌషర్) ఈ సమస్యను ఎదుర్కొంటోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రక్తదానం చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా (94555648) రక్తదానానికి సంబంధించి అపాయింట్మెంట్లను పొందవచ్చు. ఐడీ కార్డు కాపీ ద్వారా వివరాల్ని నమోదు చేయవచ్చు. బ్ల్ డోనర్ పర్మిట్ కాపీని వాట్సాప్ ద్వారా పంపిస్తారు. బ్లడ్ బ్యాంక్ వద్దకు వెళితే ఒరిజినల్ పర్మిట్ ఇవ్వబడుతుంది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు