వచ్చే నవంబరులో యూఏఈ బెలూన్ ఫ్లాగ్ ప్రారంభం
- April 19, 2021
యూఏఈ: యూఏఈ బెలూన్ టీమ్, ‘యూఏఈ ఫ్లాగ్ బెలూన్’ ప్రారంభానికి సంబంధించి సన్నాహాలు మొదలు పెట్టింది. అబుదాబీ నుంచి ప్రారంభించి రీజినల్ అలాగే గ్లోబల్ టూర్లను బెలూన్ నిర్వహించనుంది. ఈ టీమ్ ప్రస్తుతం తమ వెబ్ సైట్ తయారీలో నిమగ్నమైంది. ‘ది వరల్డ్ విల్ నాట్ ఫర్గెట్ యు జాయెద్’ పేరుతో 18 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఫౌండర్ ఫాదర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కెప్టెన్ పైలట్ అబ్దుల్ అజీజ్ నాజర్ అల్ మన్సూరి (యూఏఈ బెలూన్ టీమ్ ప్రెసిడెంట్), పలు రీజినల్ అలాగే ఇంటర్నేషనల్ బహుమతుల్ని పలువురు ప్రముఖుల నుంచి అందుకున్నారు. పలు అరబ్ దేశాలు అలాగే ఇజ్రాయెల్, సుడాన్ మరియు మొరాకో వంటి దేశాల మీదుగా బెలూన్ టూర్ నడుస్తుందని యూఏఈ బెలూన్ టెక్నికల్ సూపర్వైజర్ కెప్టెన్ రసెల్ క్లాక్ వెల్లడించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







