వచ్చే నవంబరులో యూఏఈ బెలూన్ ఫ్లాగ్ ప్రారంభం
- April 19, 2021యూఏఈ: యూఏఈ బెలూన్ టీమ్, ‘యూఏఈ ఫ్లాగ్ బెలూన్’ ప్రారంభానికి సంబంధించి సన్నాహాలు మొదలు పెట్టింది. అబుదాబీ నుంచి ప్రారంభించి రీజినల్ అలాగే గ్లోబల్ టూర్లను బెలూన్ నిర్వహించనుంది. ఈ టీమ్ ప్రస్తుతం తమ వెబ్ సైట్ తయారీలో నిమగ్నమైంది. ‘ది వరల్డ్ విల్ నాట్ ఫర్గెట్ యు జాయెద్’ పేరుతో 18 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఫౌండర్ ఫాదర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కెప్టెన్ పైలట్ అబ్దుల్ అజీజ్ నాజర్ అల్ మన్సూరి (యూఏఈ బెలూన్ టీమ్ ప్రెసిడెంట్), పలు రీజినల్ అలాగే ఇంటర్నేషనల్ బహుమతుల్ని పలువురు ప్రముఖుల నుంచి అందుకున్నారు. పలు అరబ్ దేశాలు అలాగే ఇజ్రాయెల్, సుడాన్ మరియు మొరాకో వంటి దేశాల మీదుగా బెలూన్ టూర్ నడుస్తుందని యూఏఈ బెలూన్ టెక్నికల్ సూపర్వైజర్ కెప్టెన్ రసెల్ క్లాక్ వెల్లడించారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!