కోవిడ్ కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- April 20, 2021అమరావతి: ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.ప్రతి రోజు 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఏపీలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది జగన్ ప్రభుత్వం.ఐదుగురు మంత్రులతో మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.డిప్యూటీ సీఎం,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా ఉప సంఘం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.హోంమంత్రి మేకతోటి సుచరిత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మెంబర్లుగా ఉప సంఘం ఏర్పాటు అయింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ అదిత్యనాథ్ దాస్.కరోనా కట్టడికి పలువురు కీలక అధికారులతో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కావలిసిన సలహాలు, సూచనలు చేయనుంది మంత్రి వర్గ ఉప సంఘం.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్