భారీ ఆక్సిజన్ సిలిండర్ల నుంచి పెద్ద ఎత్తున లీకేజ్..
- April 21, 2021
మహారాష్ట్ర: నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో దురదృష్టవశాత్తూ ఆక్సిజన్ ట్యాంక్ లీక్ అయింది.ఈ క్రమంలో రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలో ఉన్న 11 మంది రోగులు మరణించారు. ఆసుపత్రి వెలుపల ఉన్న పెద్ద ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒక ట్యాంక్ నుంచి భారీగా ఆక్సిజన్ లీక్ కావడంతో ఆ ప్రాంతమంతా తెల్లని గ్యాస్ వ్యాపించింది.దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటీన ఘటనా ప్రాంతానికి చేరుకుని నివారణ చర్యలు చేపట్టారు.నిఫుణులు గ్యాస్ అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆస్పత్రి అంతా కోలాహల వాతావరణం నెలకొంది.
కాగా, ఈ హాస్పిటల్ లో కరోనా రోగులకు పెద్దఎత్తున చికిత్స అందిస్తున్నారు.అసలే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం.

తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







