భారీ ఆక్సిజన్ సిలిండర్ల నుంచి పెద్ద ఎత్తున లీకేజ్..
- April 21, 2021మహారాష్ట్ర: నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో దురదృష్టవశాత్తూ ఆక్సిజన్ ట్యాంక్ లీక్ అయింది.ఈ క్రమంలో రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలో ఉన్న 11 మంది రోగులు మరణించారు. ఆసుపత్రి వెలుపల ఉన్న పెద్ద ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒక ట్యాంక్ నుంచి భారీగా ఆక్సిజన్ లీక్ కావడంతో ఆ ప్రాంతమంతా తెల్లని గ్యాస్ వ్యాపించింది.దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటీన ఘటనా ప్రాంతానికి చేరుకుని నివారణ చర్యలు చేపట్టారు.నిఫుణులు గ్యాస్ అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆస్పత్రి అంతా కోలాహల వాతావరణం నెలకొంది.కాగా, ఈ హాస్పిటల్ లో కరోనా రోగులకు పెద్దఎత్తున చికిత్స అందిస్తున్నారు.అసలే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం.
తాజా వార్తలు
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..