మహిళ హత్యకు నిరసనగా ఆందోళన
- April 23, 2021కువైట్: అల్ ఎరాడా స్క్వేర్ వద్ద పలువురు నిరసనకారులు న్యాయం కోసం ఆందోళన బాట పట్టారు. వివరాల్లోకి వెళితే, ఫరా అక్తర్ అనే మహిళను ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు, ఆమెతో పెళ్ళికి అంగీకరించలేదన్న కారణంగా నిందితుడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన వెంటనే విడుదల చేసేశారంటూ పలువురు ఆందోళనకారులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ప్రత్యేక చట్టం ద్వారా ఇలాంటి కేసుల్లో దోషుల్ని శక్షించాల్సి వుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..