మహిళ హత్యకు నిరసనగా ఆందోళన
- April 23, 2021కువైట్: అల్ ఎరాడా స్క్వేర్ వద్ద పలువురు నిరసనకారులు న్యాయం కోసం ఆందోళన బాట పట్టారు. వివరాల్లోకి వెళితే, ఫరా అక్తర్ అనే మహిళను ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు, ఆమెతో పెళ్ళికి అంగీకరించలేదన్న కారణంగా నిందితుడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన వెంటనే విడుదల చేసేశారంటూ పలువురు ఆందోళనకారులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ప్రత్యేక చట్టం ద్వారా ఇలాంటి కేసుల్లో దోషుల్ని శక్షించాల్సి వుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..