మహిళ హత్యకు నిరసనగా ఆందోళన
- April 23, 2021
కువైట్: అల్ ఎరాడా స్క్వేర్ వద్ద పలువురు నిరసనకారులు న్యాయం కోసం ఆందోళన బాట పట్టారు. వివరాల్లోకి వెళితే, ఫరా అక్తర్ అనే మహిళను ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు, ఆమెతో పెళ్ళికి అంగీకరించలేదన్న కారణంగా నిందితుడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన వెంటనే విడుదల చేసేశారంటూ పలువురు ఆందోళనకారులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ప్రత్యేక చట్టం ద్వారా ఇలాంటి కేసుల్లో దోషుల్ని శక్షించాల్సి వుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!









