ఎలక్ట్రిక్ కార్స్ తొలి చార్జింగ్ స్టేషన్ ప్రారంభం
- April 27, 2021
బహ్రెయిన్: పకృతి పరిరక్షణకు ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రొత్సహిస్తున్న బహ్రెయిన్...దేశంలో తొలి చార్జింగ్ స్టేషన్ను ప్రారంభించింది. విద్యుత్, నీటి వ్యవహారాల మంత్రి వేల్ బిన్ నాజర్ అల్-ముబారక్ తో పాటు విద్యుత్ మరియు నీటి అథారిటీ (EWA) యొక్క CEO షేక్ నవాఫ్ బిన్ ఇబ్రహీం అల్-ఖలీఫా, సార్ లోని ఏట్రియం మాల్ లో మొదటి ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ టెక్నాలజీలో ప్రముఖ కంపెనీగా గుర్తింపు ఉన్న సిమెన్స్ సౌజన్యంతో చార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. భవిష్యత్ గమనంలో ఇది తొలి అడుగు మాత్రమేనని..రాబోయే రోజుల్లో మరిన్ని స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. చార్జింగ్ పాయింట్ కు వచ్చే వాహనాల డేటా, వాహనదారులు ఇచ్చే ఫీడ్బ్యాక్పై అధ్యయనం చేసి తద్వారా కొత్త స్టేషన్లలో అభివృద్ధి ప్రక్రియ నిరంతరంగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









