ఎలక్ట్రిక్ కార్స్ తొలి చార్జింగ్ స్టేషన్ ప్రారంభం
- April 27, 2021బహ్రెయిన్: పకృతి పరిరక్షణకు ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రొత్సహిస్తున్న బహ్రెయిన్...దేశంలో తొలి చార్జింగ్ స్టేషన్ను ప్రారంభించింది. విద్యుత్, నీటి వ్యవహారాల మంత్రి వేల్ బిన్ నాజర్ అల్-ముబారక్ తో పాటు విద్యుత్ మరియు నీటి అథారిటీ (EWA) యొక్క CEO షేక్ నవాఫ్ బిన్ ఇబ్రహీం అల్-ఖలీఫా, సార్ లోని ఏట్రియం మాల్ లో మొదటి ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ టెక్నాలజీలో ప్రముఖ కంపెనీగా గుర్తింపు ఉన్న సిమెన్స్ సౌజన్యంతో చార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. భవిష్యత్ గమనంలో ఇది తొలి అడుగు మాత్రమేనని..రాబోయే రోజుల్లో మరిన్ని స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. చార్జింగ్ పాయింట్ కు వచ్చే వాహనాల డేటా, వాహనదారులు ఇచ్చే ఫీడ్బ్యాక్పై అధ్యయనం చేసి తద్వారా కొత్త స్టేషన్లలో అభివృద్ధి ప్రక్రియ నిరంతరంగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా