భారత్ కు కువైట్ సాయం..ఆక్సిజన్ సిలిండర్లు పంపించాలని నిర్ణయం
- April 27, 2021
కువైట్: రోజుకు లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ కు బాసటగా నిలవాలని కువైట్ తీర్మానించింది. కోవిడ్ కొత్త వేరియంట్ వైరస్ తో అల్లాడుతున్న ప్రజలకు తమ వంతు సాయంగా ఆక్సిజన్ సిలిండర్లను పంపించాలని కువైట్ మంత్రిమండలి నిర్ణయించింది. కోవిడ్ కేసులు విపరీతంగా పెరగటం..ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకోవటంతో చాలా మంది ప్రాణాలు కొల్పోతున్న విషయం తెలిసిందే. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులు చూస్తే ఆందోళనకర వాతావరణం నెలకొంది. దీనిపై చలించిన కువైట్ మంత్రి మండలి ఆక్సిజన్ సిలిండర్ లను పంపటం ద్వారా భారత్ కు మద్దతుగా నిలబడాలని తీర్మానించింది. కువైట్-భారత్ మధ్య స్నేహన్ని మరింత బలపర్చుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో, వ్యాక్సిన్ విషయంలోనూ భారత్ తమకు మద్దతుగా నిలబడిన విషయాన్ని గుర్తు చేసుకుంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







