కోవిడ్ డిజిటల్ వెరిఫికేషన్ ప్రారంభించిన ఎమిరేట్స్, డీహెచ్ఏ
- April 27, 2021
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు చెక్ ఇన్ మరింత సులభం కానుంది. కోవిడ్ నేపథ్యంలో పీసీఆర్ టెస్ట్ రిపోర్టులు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు ఇక వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్, దుబాయ్ ఆరోగ్య శాఖ మధ్య ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం మేరకు దుబాయ్ పరిధిలో పీసీఆర్ టెస్ట్ రిపోర్టులు, వ్యాక్సినేషన్ వివరాల డేటాను ఎమిరేట్స్ తో పంచుకోనుంది. అంటే ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లో టికెట్ బుక్ చేసుకునే వ్యక్తి దుబాయ్ లో పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే అతను ప్రయాణ సమయంలో పీసీఆర్ రిపోర్ట్ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ వెరిఫికేషన్ తోనే ప్రయాణికుల కోవిడ్ రికార్డ్ ను పరిశీలించి చెక్ ఇన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







