29న ఏపీ కేబినెట్ భేటీ..

- April 27, 2021 , by Maagulf
29న ఏపీ కేబినెట్ భేటీ..

అమరావతి: ఏపీ రాష్ట్రంలో క్ర‌మంగా క‌రోనా పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతోన్న‌ స‌మ‌యంలో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ స‌మావేశం కానుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.ఈ నెల 29వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు స‌చివాల‌యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న కేబినెట్ స‌మావేశంలో.. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై చ‌ర్చించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు.వ్యాక్సిన్ల కొర‌త వెంటాడుతుండ‌గా.. వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేయ‌డంపై కూడా దృష్టిసారించ‌నుంది ఏపీ కేబినెట్.. క‌రోనా రోగుల‌కు అందుతున్న వైద్య స‌దుపాయాల‌పై చ‌ర్చించ‌నున్న సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఆక్సిజ‌న్, బెడ్లు, రెమిడెసివిర్ కొర‌త వంటి అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశాలున్నాయి. వీటితో పాటు ప‌లు కీల‌క ఎజెండాల‌పై చ‌ర్చంచ‌నుంది కేబినెట్. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com