లోక్ సభలో ప్రవేసపెట్టిన ఆధార్ బిల్లు

- March 03, 2016 , by Maagulf
లోక్ సభలో ప్రవేసపెట్టిన ఆధార్ బిల్లు

ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ ను చట్టబద్ధం చేసే బిల్లును ప్రభుత్వం ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఆధార్ బిల్లు2016 ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును రాజ్యసభ ఆమెదం అవసరంలేని ఆర్థిక బిల్లుగా ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఈ బిల్లును మనీ బిల్లుగా ప్రవేశపెట్టడాన్ని సమర్ధించుకున్నారు. కాంగ్రెస్ హయాంలో జువెనైల్, కార్మికుల నష్టపరిహారం బిల్లులను మనీ బిల్లులుగానే ప్రవేశపెట్టిన సంగతిని గుర్తు చేశారు. ఈ బిల్లు తో సుపరిపాలన, పారదర్శకత పెరుగుతాయని జైట్లీ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com