సవాళ్లకు పరిష్కారం చెబితే ప్రైజ్మనీ
- April 28, 2021దుబాయ్: ఎప్పిటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకోటంలో పోటీపడుతున్న దుబాయ్ పోలీసులు..మరో వినూత్న ఆవిష్కరణతో ప్రజల ముందుకు వచ్చారు. ఎక్స్ ట్రనల్ ఇన్నోవేషన్ ప్లాట్ ఫాం పేరుతో ప్రజల నుంచి కూడా కొత్త ఆలోనలను స్వీకరించేలా ఓ డిజిటల్ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేశారు. యూఏఈ 50వ వ్యవస్థాపక వార్షికోత్సంతో పాటు అంతర్గత మంత్రిత్వ శాఖలో నిర్వహిస్తున్న స్వర్ణోత్సవం సందర్భంగా ఇన్నోవేషన్ ప్లాట్ ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వేదికగా ఎవరైనా ప్రజలు తమ ఆలోచనలను, నూతన విధానాలను పోలీసులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే సవాళ్లకు తగిన పరిష్కారం చెప్పవచ్చు. అలా సరైన పరిష్కారం చెప్పిన వారిలో ఎంపిక చేసిన వారికి Dhs25,000 ప్రైజ్ మనీ ఉంటుందని దుబాయ్ పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు