భారత్ కు అన్ని విధాల సాయం అందిస్తాం: కువైట్
- April 28, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వేరియంట్ వైరస్ తో సతమతం అవుతోన్న భారత్ కు తాము అన్ని విధాల అండగా ఉంటామని కువైట్ ప్రకటించింది. ఈ మేరకు కువైట్ కేబినెట్ వ్యవహారాల మంత్రి షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్-మహ్మద్ అల్-సబా..భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కువైట్- భారత్ మైత్రి బంధాన్ని చాటేలా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తాము అన్ని విధాల సాయం అందిస్తామని మంత్రి అన్నారు. ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇథనాల్ కు భారత్ కు పంపించనున్నట్లు వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







