దుబాయ్లోని పార్కుల్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లకు అనుమతి లేదు
- April 29, 2021
దుబాయ్: పబ్లిక్ పార్కుల్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను అనుమతించబోమని దుబాయ్ అథారిటీస్ స్పష్టం చేశాయి. ప్రమాదాల నివారణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. బైసికిల్ ట్రాక్ల మీద విజిటర్స్ నడవడానికి వీల్లేదనీ, సైకిల్ రైడర్లు గంటకు 15 కిలోమీటర్లను మించిన వేగంతో నడపరాదని అధికారులు స్పష్టం చేశారు. కాగా, గత అక్టోబర్లో ఇ-స్కూటర్లను అనుమతిస్తున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్ రిగ్గా, జుమైరా లేక్స్ టవర్స్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బోలెవార్డ్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, 2 డిసెంబర్ స్ట్రీట్లపై మాత్రమే ఇ-స్కూటర్లను అనుమతిస్తున్నారు. కాగా, దుబాయ్ రెసిడెంట్స్, ఈ-స్కూటర్లు ప్రమాదకరంగా మారాయని, యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయని ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









