శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత..
- April 29, 2021
హైదరాబాద్: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక కోటి 36 లక్షలు విలువ చేసే బంగారాన్ని గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి బంగారం తరలిస్తున్నాడనే సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం EK-526 విమానం ద్వారా దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేశారు.ఈ తనఖీలో ప్రయాణికుడి నుంచి 2.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు ఒక కోటి 36 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









