భారత్-యూఏఈ ట్రావెల్ బ్యాన్ పొడిగింపు
- April 29, 2021
యూఏఈ: భారత్ లో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో భారత్ పై ట్రావెల్ బ్యాన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది యూఏఈ. మరో పది రోజుల పాటు అంటే..మే 14 వరకు భారత్ నుంచి విమానాలను అనుమతించబోమని స్పష్టం చేసింది.అలాగే..ఇతర దేశాల నుంచి వచ్చే వారు కూడా ప్రయాణానికి 14 రోజుల్లోపు భారత్ లో పర్యటించినట్లైతే వారికి కూడా ట్రావెల్ బ్యాన్ అంక్షలు వర్తిస్తాయి. అయితే..రెండు దేశాల దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తల విమానాలకు ట్రావెల్ బ్యాన్ వర్తించదని స్పష్టం చేసింది. అలాగే గోల్డెన్ రెసిడెన్సీ హోల్డర్స్ కి కూడా ఆంక్షలు వర్తించవు. అయితే..వీరంతా కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని, యూఏఈకి చేరుకోగానే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటంతో పాటు పది రోజులు క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. దేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి నాలుగో రోజు, ఏనిమిదో రోజు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని పేర్కొంది యూఏఈ.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









