ఏపీలో కరోనా కేసుల వివరాలు
- April 30, 2021
అమరావతి: ఏపీ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.సెకండ్ వేవ్ మొదలైన తర్వాత క్రమంగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించిన వివరాల ప్రకారం..గత 24 గంటల్లో ఏపీలో 17,354 కొత్త పాజిటివ్ కేఉలు నమోదు కాగా.. 64 మంది మృతి చెందారు.దీంతో..రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,98,795కు చేరుకోగా.. ఇప్పటి వరకు 9,67,823 మంది డిశ్చార్జ్ అయ్యారు.. 7,992 మంది కోవిడ్ బారినపడి మృతిచెందగా.. ప్రస్తుతం 1,22,980 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.
ఇక, ప్రైవేట్ ఆస్పత్రిలకు 15,294 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఇచ్చినట్టు అనిల్ కుమార్ సింఘాల్తెలిపారు.437 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేశామని.. ఆక్సిజన్ సరఫరాను మరింత పెంచాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు.ఏపీకి రెండు ట్యాంకర్లు అందుబాటులోకి రానున్నాయి.. క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉంటే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. శ్రీ సిటీలో క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్టు సమాచారం ఉందన్న ఆయన.. కోవిడ్ కేర్ సెంటర్లు కొత్తవి ప్రారంభిస్తున్నాం 7,749 మంది కోవిడ్ కేర్ సెంటర్లల్లో ఉన్నారని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య 15 వేలకు చేరొచ్చని అంచనా వేశారు.
తాజా వార్తలు
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!









