భారత్ లో కరోనా కేసుల వివరాలు
- May 01, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.సెకండ్ వేవ్లో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ కోవిడ్ కేసులు పైపైకి కదులుతూనే ఉన్నాయి.ఇవాళ ఏకంగా 4 లక్షల మార్క్ను కూడా క్రాస్ చేసింది కరోనా రోజువారి కేసుల కౌంట్.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,01,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3523 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,99,988 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం శుభపరిణామంగా చెప్పుకోవాలి.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,91,64,969కు చేరుకోగా.. రికవరీ కేసులు 1,56,84,406 కి పెరిగాయి.ఇక ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 2,11,853 మంది మృతిచెందగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 32,68,710గా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.మరోవైపు.. ఇప్పటి వరకు 15,49,89,635 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు ప్రకటించింది.ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,45,299 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 28,83,37,385కి చేరినట్టు ICMR వెల్లడించింది
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
- అమెరికాకు టెన్షన్ పెడుతున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ









