ఈటల అవుట్..కేసీఆర్ ఇన్.. వెనువెంటనే అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ
- May 01, 2021
ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖను చూశారు మంత్రి ఈటల రాజేందర్.. అయితే, ఆయనపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో.. ఆ శాఖను సీఎం కేసీఆర్కు బదిలీ చేశారు గవర్నర్ తమిళిసై.. కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఈ శాఖ చాలా కీలకం.. నిరంతరం పర్యవేక్షించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి గనుక.. వెంటనే సీఎస్ సోమేష్ కుమార్కు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు సీఎం. రెమిడెసివర్ వంటి మందుల విషయంలో గానీ, వాక్సీన్ విషయంలో గానీ, ఆక్సిజన్ మరియు బెడ్ల లభ్యత విషయంలో గానీ, ఏ మాత్రం లోపం రానీయొద్దని సీఎంకు స్పష్టం చేశారు.. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గాను సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..









