హైదరాబాద్ చేరిన రష్యా వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వి'
- May 01, 2021
దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్-వి డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నాయి. 1.5-2 లక్షల వయల్స్ తొలి విడతలో భారత్కు చేరుకోనున్నట్లు ఇటీవలే రష్యాలోని భారత రాయబారి బాల వెంకటేశ్ వర్మ తెలిపారు. నేటి నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కావడం.. మరోవైపు టీకాల కొరత వేధిస్తున్న తరుణంలో స్పుత్నిక్-వి టీకాలు భారత్ చేరుకోవడం ఊరట కలిగించే అంశం. ఇక ఈ నెలలోనే భారత్లో ఈ టీకా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సమాచారం. దేశీయంగా స్పుత్నిక్-వికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చేపట్టిన విషయం తెలిసిందే.
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) సహకారంతో గమలేయా ఇన్స్టిట్యూట్ తయారు చేసిన స్పుత్నిక్ టీకాను భారత్లో ఉత్పత్తి, పంపిణీకి గతేడాది సెప్టెంబర్లోనే డాక్టర్ రెడ్డీస్తో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా.. రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపు 1600 మంది వాలంటీర్లపై నిర్వహించిన డాక్టర్ రెడ్డీస్, అనుమతి కోసం డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది. వీటి ఫలితాల సమాచారాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ.. భారత్లో అత్యవసర వినియోగానికి ఏప్రిల్ 12న పచ్చజెండా ఊపింది. మరోవైపు ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్లు భారత్లో వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!







