బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- June 16, 2026
రియాద్: బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఆరేళ్ల సౌదీ బాలుడి అవయవాలు.. బురైదాలో నలుగురు రోగుల ప్రాణాలను కాపాడాయి.బాలుడి కుటుంబం అవయవ దానానికి అంగీకరించడంతో.. నాలుగురికి విజయవంతంగా అవయవాలను అమర్చారు. అవయవ వైఫల్యంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలతో సహా నలుగురు రోగులకు ప్రయోజనం చేకూరింది. సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కు చెందిన ఒక ప్రత్యేక బృందం, బురైదాలోని మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్తో కలిసి ఆ బాలుడి నుండి అవయవాలను సేకరించింది.
ఒక పది నెలల పసికందుకు గుండెను అమర్చారు. లివర్ వైఫల్యంతో బాధపడుతున్న ఎనిమిదేళ్ల బాలికకు లివర్ ను, 37 మరియు 21 ఏళ్ల వయస్సు గల ఇద్దరు రోగులకు మూత్రపిండాలను మార్పిడి చేసినట్టు సౌదీ అవయవ మార్పిడి కేంద్రం డైరెక్టర్ డాక్టర్ తలాల్ అల్-ఖౌఫీ తెలిపారు.ఈ సందర్భంగా మరణించిన బాలుడి కుటుంబం తీసుకున్న ప్రాణరక్షక నిర్ణయానికి ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.
తాజా వార్తలు
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..









