పూర్తిస్థాయి కర్ఫ్యూ అవసరం లేదన్న సుప్రీం కమిటీ
- May 02, 2021
కువైట్ సిటీ: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పూర్తి స్థాయి కర్ఫ్యూ అవసరం లేదని కువైట్ సుప్రీం కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గినట్లు కమిటీ వెల్లడించింది. పాక్షిక కర్ఫ్యూ విధింపుతో కోవిడ్ తో ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య కొన్నాళ్లుగా స్థిరంగా ఉందని తెలిపింది. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతానికి పూర్తి కర్ఫ్యూ అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే..వైరస్ బారిన పడుతున్నవారిలో ఎక్కువ మంది ప్రవాసీయులే ఉంటున్నారని, కోవిడ్ తో ఆస్పత్రిలో చేరుతున్న వారిలో 65 శాతం ప్రవాసీయులేనని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలాఉంటే..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని..అయినా, ముందస్తు జాగ్రత్తలతో కువైట్ దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించగలుగుతోందని సుప్రీం కమిటీ పేర్కొంద.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







