తిరుపతిలో వైసీపీ విజయం

- May 02, 2021 , by Maagulf
తిరుపతిలో వైసీపీ విజయం

తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితం వెలువడింది.మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన వైసీపీ ఘనవిజయం సాధించింది.వైసీపీ అభ్యర్థి గురుమూర్తి సమీప టీడీపీ అభ్యర్థిపై 2.31 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  గురుమూర్తికి మొత్తం 5,37,152 ఓట్లు పోలవ్వగా,తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి 3,05,209 ఓట్లు పోలయ్యాయి.ఇక ఇదిలా ఉంటె, బీజేపీ-జనసేన అభ్యర్ధికి 50,739 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 8,477 ఓట్లు నోటాకు 13,401 ఓట్లు పోలయ్యాయి.వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com