గాంధీ ఆస్పత్రికి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- May 02, 2021
హైదరాబాద్: కోవిడ్ రోగుల కోసం గాంధీ ఆస్పత్రికి డీఆర్డీవో నుంచి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీవో మిస్సైల్ డీజీ ఎమ్మెస్సార్ ప్రసాద్, గాంధీ సూపరిండెంట్ రాజారావు హాజరయ్యారు. కిషన్ రెడ్డి తమకు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే రెస్పాండ్ అవుతున్నారని, డీఆర్డీవో నుంచి వచ్చిన సిలెండర్లతో మరి కొంతమందిని కాపాడుకోగలుగుతామని రాజారావు అన్నారు. కిషన్ రెడ్డి చొరవ వల్లే అన్ని రకాలుగా గాంధీ సేవలందించగలుగుతుందని ఆయన పేర్కొన్నారు. 650 ఐసీయూ పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా సేవలందిస్తుందని, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రోగులు వస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో కేంద్రం తోడు ఎప్పుడూ ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉండకూడదని సీఎస్ తో తాను మాట్లాడానని కేంద్ర మంత్రి చెప్పారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







