మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్‌

- May 02, 2021 , by Maagulf
మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్‌

హైదరాబాద్‌: వైద్యాఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.శుక్రవారం ఆ ఆరోపణలు వచ్చిందే తడవుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు విచారణకు ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు.దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ పంపారు. సీఎం సిఫార్సు మేరకు గవర్నర్ తమిళిసై ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో ఇకపై ఈటల రాజేందర్ మాజీ మంత్రి కానున్నారు.కలెక్టర్‌ నివేదికలో కబ్జాలకు పాల్పడినట్లు తేలడంతో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com