భారత్ లో కరోనా కేసుల వివరాలు

- May 03, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి  తీవ్రంగా  ఉన్నది.కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 3,68,147 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,99,25,604కి చేరింది.  ఇందులో 1,62,93,003 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,13,642 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 3417 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,18,959కి చేరింది.దేశంలో 24 గంటల్లో 3,00,732 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.ఇకపోతే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 15,71,98,207 మందికి వ్యాక్సిన్ ను అందించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com