ఏపీ కరోనా అప్డేట్

- May 03, 2021 , by Maagulf
ఏపీ  కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజుకు వెయ్యికి పైగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 18,972 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,63,994 కు చేరింది.ఇందులో 10,03,935 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,51,852 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 71 మంది మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 8,207 మంది మృతి చెందారు.ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,227 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 1,15,275 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com