మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కుట్రను భగ్నం చేసిన బోర్డర్స్ గార్డ్స్
- May 04, 2021
సౌదీ: సౌదీలోకి భారీ ఎత్తున మత్తుపదార్ధాలను స్మగ్లింగ చేయాలన్న కుట్రను సరిహద్దు భద్రతా అధికారులు అడ్డుకున్నారు. దాదాపు 1000 కిలోలకు పైగా హషీష్ను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఫర్ నార్కోటిక్స్ కంట్రోల్తో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో జజాన్ ప్రాంతంలో 515 కిలోల డ్రగ్స్ తో పాటు 961 కిలోల మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 18 మంది ఇథియోపియన్ జాతీయులు, నలుగురు యెమెన్లు, ఇద్దరు సౌదీ పౌరులతో సహా మొత్తం 24 మందిని అదుపులోకి చేసుకున్నారు. ఇదిలాఉంటే..ఖట్ ప్రాంతంలో 44.7 టన్నుల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది సౌదీ పౌరులు, ఏడుగురు యెమెన్లతో సహా 23 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







