కమెడియన్ పాండు కన్నుమూత.. !
- May 06, 2021చెన్నై: కరోనా... కోలీవుడ్ చిత్రపరిశ్రమలో మరో విషాదాన్ని నింపింది, ప్రముఖ కమెడియన్ పాండు(74) కరోనా కారణంగా కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు, పాండుకు భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన భార్యకి కరోనా సోకడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. పాండు మృతి పట్ల చిత్రపరిశ్రమలోని పలువురు సంతాపం తెలుపుతున్నారు. కాగా 1970 లో మానవన్ చిత్రంతో ఆయన నటుడిగా అరంగేట్రం చేశారు. ఆయన సోదరుడు ఇడిచాపులి సెల్వరాజ్ కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?