ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు వాయిదా
- May 06, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రెండో దశ తీవ్రత పెరగడంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే.అయితే కరోనా వ్యాప్తికి ఈ ఎన్నికలే కారణమని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా, ఇటీవలే తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి, ఏపీలోని తిరుపతి లోక్సభ స్థానానికి, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రెండు చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. తిరుపతిలో వైసీీపీ అభ్యర్థి గురుమూర్తి, నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ నేత నోముల భగత్ విజయం సాధించారు.
తాజా వార్తలు
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..