ఏపీ సహా ప‌లు రాష్ట్రాల్లో ఉపఎన్నిక‌లు వాయిదా

- May 06, 2021 , by Maagulf
ఏపీ సహా ప‌లు రాష్ట్రాల్లో ఉపఎన్నిక‌లు వాయిదా

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వైర‌స్ రెండో ద‌శ‌ తీవ్రత పెరగడంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో ఏపీతో స‌హా ప‌లు రాష్ట్రాల్లో జ‌ర‌గాల్సిన ఉప‌ఎన్నిక‌ల విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెన‌క్కి త‌గ్గింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.అయితే క‌రోనా వ్యాప్తికి ఈ ఎన్నిక‌లే కార‌ణ‌మని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కాగా, ఇటీవలే తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి, ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రెండు చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. తిరుపతిలో వైసీీపీ అభ్యర్థి గురుమూర్తి, నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ నేత నోముల భగత్ విజయం సాధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com