ఇండియాకి 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపించనున్న కువైట్

- May 06, 2021 , by Maagulf
ఇండియాకి 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపించనున్న కువైట్

కువైట్: 215 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ అలాగే వెయ్యికి పైగా ఆక్సిజన్ ట్యాంకుల్ని ఇండియాకి పంపాలని కువైట్ నిర్ణయించింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో కువైట్, భారతదేశానికి ఈ సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో కువైట్ రాయబారి అల్ నజెమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. షువైఖ్ పోర్టు నుంచి భారత నేవీ షిప్ 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తోపాటు బయల్దేరింది. ఒక్కోటి 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల రెండు ఆక్సిజన్ ట్యాంకులు ఈ షిప్ ద్వారా ఇండియాకి వెళుతున్నాయి. అల్ షుయైబా పోర్టు నుంచి 75 మెట్రిక్ టన్నులను అలాగే 1000 సిలెండర్లను ఇండియాకి పంపిస్తున్నారు. గురువారం 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, ఐదు ట్యాంకుల ద్వారా తరలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com