ఇండియాకి 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపించనున్న కువైట్
- May 06, 2021
కువైట్: 215 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ అలాగే వెయ్యికి పైగా ఆక్సిజన్ ట్యాంకుల్ని ఇండియాకి పంపాలని కువైట్ నిర్ణయించింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో కువైట్, భారతదేశానికి ఈ సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో కువైట్ రాయబారి అల్ నజెమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. షువైఖ్ పోర్టు నుంచి భారత నేవీ షిప్ 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తోపాటు బయల్దేరింది. ఒక్కోటి 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల రెండు ఆక్సిజన్ ట్యాంకులు ఈ షిప్ ద్వారా ఇండియాకి వెళుతున్నాయి. అల్ షుయైబా పోర్టు నుంచి 75 మెట్రిక్ టన్నులను అలాగే 1000 సిలెండర్లను ఇండియాకి పంపిస్తున్నారు. గురువారం 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, ఐదు ట్యాంకుల ద్వారా తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









