34 మందితో తమిళనాడు క్యాబినెట్... గవర్నర్ ఆమోదం

- May 06, 2021 , by Maagulf
34 మందితో తమిళనాడు క్యాబినెట్... గవర్నర్ ఆమోదం

చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతోంది. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మంత్రివర్గాన్ని రూపొందించారు. తనతో కలిపి 34 మంది మంత్రుల జాబితాను స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు పంపారు. గవర్నర్ ఈ జాబితాను లాంఛనంగా ఆమోదించారు. భావి సీఎం స్టాలిన్ సిఫారసులకు రాజముద్ర వేశారు.కాగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి కూడా మంత్రివర్గంలో స్థానం లభించనుందని గత కొన్నిరోజులుగా తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, స్టాలిన్ గవర్నర్ కు పంపిన జాబితాలో ఉదయనిధి పేరు లేదు. ఇక, స్టాలిన్ సాధారణ పరిపాలన సహా పలు శాఖలను తన వద్ద ఉంచుకుంటున్నట్టు తెలుస్తోంది. స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com