రమదాన్: 1000కి పైగా వాహనాల సీజ్
- May 06, 2021
దోహా: రమదాన్ నేపథ్యంలో చేపట్టిన తనిఖీల సందర్భంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఇప్పటివరకూ 1000కి పైగా వాహనాల్ని నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో సీజ్ చేయడం జరిగింది. సంబంధిత శాఖలకు సీజ్ చేసిన వాహనాల్ని తదుపరి చర్యల నిమిత్తం అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారి కెప్టెన్ మొహమ్మద్ సఫర్ అల్ కువారి మాట్లాడుతూ, రమదాన్ తొలి రోజు నుంచి ఈ తనిఖీలు ప్రారంభించామనీ, రమదాన్ పూర్తయ్యేదాకా ఈ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. సివిలియన్ అలాగే మిలిటరీ పెట్రోల్స్ తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకపోవడం వల్ల ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు చోటు చేసుకుంటాయన్నారు అధికారులు.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







