కడప జిల్లాలో పేలుడు పై స్పందించిన చంద్రబాబు
- May 08, 2021హైదరాబాద్: కడప జిల్లాలో పేలుడు ఘటనపైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.ఈ ఘటన పైన ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాగా పేలుడు పదార్థాల విస్ఫోటనంతో 8 మంది కూలీలు మృతి చెందారు. కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ శివారులోని ముగ్గురాళ్ల గనిలో ఈ బ్లాస్టింగ్ సంభవించింది.ముగ్గు రాయి తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడుతుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి.ఈ ప్రమాదంలో ఎనమిది మంది కూలీలు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ