కడప జిల్లాలో పేలుడు పై స్పందించిన చంద్రబాబు

- May 08, 2021 , by Maagulf
కడప జిల్లాలో పేలుడు పై స్పందించిన చంద్రబాబు

హైదరాబాద్: కడప జిల్లాలో పేలుడు ఘటనపైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.ఈ ఘటన పైన ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాగా పేలుడు పదార్థాల విస్ఫోటనంతో 8 మంది కూలీలు మృతి చెందారు. కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ శివారులోని ముగ్గురాళ్ల గనిలో ఈ బ్లాస్టింగ్ సంభవించింది.ముగ్గు రాయి తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడుతుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి.ఈ ప్రమాదంలో ఎనమిది మంది కూలీలు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com