న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు 'మెయిల్' సినిమా
- May 08, 2021
హైదరాబాద్: ప్రియదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధాన పాత్రధారులుగా స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రియాంక దత్ నిర్మించిన సినిమా 'మెయిల్'. ఓటీటీ కోసం తీసిన ఈ సినిమాను ఈ యేడాది జనవరిలో సంక్రాంతి కానుకగా 'ఆహా'లో స్ట్రీమింగ్ చేశారు. 1980 నేపథ్యంలో సాగే ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రాన్ని యువతరం బాగా ఆదరించింది. కంప్యూటర్ వచ్చిన కొత్తలో ఆ టెక్నాలజీకి అలవాటు పడలేక, దానిని అర్థం చేసుకోలేక కుర్రాళ్ళు పడిన తిప్పలను వినోద ప్రధానంగా దర్శకుడు ఉదయ్ గుర్రాల ఈ చిత్రంలో చూపించాడు. అయితే... ఈ కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో ఈ చిత్ర బృందానికి ఓ తీపి కబురు లభించింది. జూన్ 4 నుండి అమెరికాలో జరుగబోతున్న 'న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్'లో 'మెయిల్' చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని స్వప్న సినిమా సంస్థ ట్వీట్ చేస్తూ, తన హర్షాన్ని వెలిబుచ్చింది. 'కంబాలపల్లి కథలు' సీరిస్ లో తొలిగా వచ్చిన 'మెయిల్'కు లభించిన ఆదరణను దృష్ట్యా మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఓటీటీ చిత్రాలు ఇదే సీరిస్ లో తీస్తారేమో చూడాలి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







